యాదాద్రి మహాద్భుతం: ఏపీ మంత్రి బొత్స

71
botsa
- Advertisement -

ఏడేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నానని తెలిపారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. యాదాద్రి దేవ‌స్థానాన్ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మ‌హాద్భుతంగా తీర్చి దిద్దార‌ని కొనియాడారు. కుటుంబ స‌మేతంగా యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకుని..ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

2015లో ద‌ర్శించుకున్నాన‌ని వెల్ల‌డించారు. నాటికీ నేటికీ యాదాద్రి ఆల‌య రూపురేఖ‌లు మారిపోయాయ‌న్నారు. కుటుంబ స‌మేతంగా స్వామి వారి ద‌ర్శ‌నం అద్భుతంగా జ‌రిగింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని స్వామి వారిని వేడుకున్న‌ట్లు తెలిపారు.

అంతకముందు ఆల‌య అర్చ‌కులు ఆల‌య సంప్ర‌దాయ రీతిలో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

- Advertisement -