కోర్టు ధిక్కరణ…8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

120
ap hc
- Advertisement -

ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో షాకింగ్ తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్​కు రెండు వారాలు జైలుశిక్షతో పాటుగా జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే తీర్పు వెలువడిన వెంటనే ఐఏఎస్‌లు క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. ఒకరోజు కోర్టు ఖర్చులతో పాటు విద్యార్థుల మధాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని తీర్పు వెల్లడించింది.

- Advertisement -