ఒకే వేదికపైకి సీఎం జగన్‌,బాలయ్య,ఎన్టీఆర్‌..!

413
jagan balakrishna
- Advertisement -

త్వరలో ఓ అపురూప దృశ్యం ఏపీ ప్రజలను అలరించబోతోంది. ఒకే వేదికపై సీఎం జగన్‌, నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నారు. ఈ ఘట్టానికి నంది అవార్డ్స్‌ వేదిక కానుంది. ప్రతి ఏటా సినిమా రంగంలో సేవలను అందించిన వారికి ఏపీ సర్కార్ నంది అవార్డ్స్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా త్వరలో నంది అవార్డ్సు అందించేందుకు సిద్ధమైంది. 2011వరకు నంది అవార్డులను క్రమం తప్పకుండా ఇచ్చారు. కానీ ఆ తర్వాత అవార్డుల కార్యక్రమానికి బ్రేక్ పడింది.

2012లో నాని, 2013లో మిర్చి సినిమాకు గాను ప్రభాస్ కు ఉత్తమనటుడిగా అవార్డులను ఇచ్చారు. ఆ తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను అవార్డులను అవార్డులను ప్రకటించినా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో ఆగిపోయిన అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టేందుకు వైసీపీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలనతో తనదైన మార్క్‌ చూపిస్తున్న జగన్‌ సినీ రంగంపై తనదైన ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అగ్రహీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబులతో ఒకే వేదిక పంచుకోనున్నారు జగన్‌. త్వరలో ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవేమో.

- Advertisement -