114 మందితో ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

19
- Advertisement -

114 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది కాంగ్రెస్. అలాగే 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కడప నుండి పోటీ చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాజమండ్రి నుండి గిడుగు రుద్రరాజు,కాకినాడ నుంచి పల్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పేర్లను ప్రకటించారు.

శింగనమల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు చింతల పూడి అభ్యర్థిగా ఎలీజా,నందికొట్కూరు అభ్యర్థిగా ఆర్థర్ ,పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌పై మదేపల్లి సత్యానంద రావు పోటీ చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబుపై ఆవుల గోవిందరాజు బరిలో ఉన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే…

- Advertisement -