TTD:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

25
- Advertisement -

సెప్టెంబరు 18వ తేదీ నుండి 26 వతేదీ వరకు జరిగే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రిని చైర్మన్ కరుణాకరరెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also Read:సెట్విన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ సంతోష్..

- Advertisement -