- Advertisement -
ఏపీ బడ్జెట్ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 5 నుండి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న గవర్నర్ ప్రసంగం , ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
Also Read:మార్నింగ్ వాక్..అనేక రోగాలకు చెక్!
- Advertisement -