ఏపీ అసెంబ్లీ..కొట్టుకున్న ఎమ్మెల్యేలు

43
- Advertisement -

ఏపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. వైసీపీ – టీడీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. ఇందుకు జీవో నెంబర్ 1 కారణమైంది. ఈ జీవోను రద్దు చేయాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పేపర్లు చింపి స్పీకర్‌ పోడియంపై విసిరేశారు.

దీంతో పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేపట్టారు. చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య ఓ దశలో తోపులాట జరిగింది. ఓ దశలో ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ కొట్టుకున్నారు.

సభ్యులను కంట్రోల్ చేయటానికి ఎంతో ప్రయత్నించారు స్పీకర్. ఎంతకూ ఎమ్మెల్యేలు వినకపోవడంతో శాసనసభను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం ఒకరిపై ఒకరు బయటకూడా విమర్శలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -