విరుష్క విందులో నమో

175
- Advertisement -

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రిసెప్షన్ ఢిల్లీలోని చాణక్యపురి తాజ్‌ హోటల్‌ దర్బార్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.  ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరై..విరుష్క జోడిని ఆశీర్వదించారు. కోహ్లి-అనుష్క జంటను చూసేందుకు వచ్చిన అతిథులకు రెండు కళ్లు చాలలేదు. వైట్ సిల్క్ కుర్తాలో 18 క్యారెట్ల బంగారం పొదిగిన బటన్స్ పెట్టుకుని విరాట్ కోహ్లీ కనువిందు చేశాడు. రెడ్ అండ్ గోల్డ్ బెనారస్ చీరలో అనుష్క శర్మ ధగధగ మెరిసిపోయింది.

Anushka And Virat Reception: Yes, PM Modi Was There
డిసెంబర్ 26న ముంబైలో మరోసారి రిసెప్షన్ నిర్వహించాలని ఈ జంట నిర్ణయించింది. ఢిల్లీలో సింపుల్‌గా రిసెప్షన్ చేసుకున్న ఈ జంట ముంబైలో మాత్రం బాలీవుడ్ తారలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్ల సమక్షంలో రిసెప్షన్ చేసుకోబోతోంది. ఈ విందు పూర్తయ్యాక వీరిద్దరూ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్నారు.

- Advertisement -