సూపర్ నుండి నిశ్శబ్దం వరకు…అనుష్క జర్నీ

299
anushka
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో అసలు కథానాయిక అంటే గ్లామర్ పాత్రల్లో మెరిసే ఓ బొమ్మ అన్న ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఆ ఆలోచనను పటాపంచల్ చేసి కథానాయికకి సరైన నిర్వచనం చెప్పింది అనుష్క శెట్టి. ఓ అరుంధతి, ఓ సరోజా, ఓ దేవసేన, ఓ రుద్రమదేవీ ఇలా పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేసి అందులో లీనమైపోయి జీవించేసింది. తన అందం.. అభినయంతో తోటి కథానాయికలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

1981 నవంబర్ 7 న బెంగళూర్ లో జన్మించింది అనుష్క శెట్టి. యోగా టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సూపర్(2005) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆపై తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసింది. తన సినీ జీవితంలో మొత్తం పదేళ్లలో దక్షిణాది భాషల్లో 39 సినిమాల్లో నటించింది. మెగాస్టార్‌ చిరంజీవితో కూడా స్టాలిన్‌లో ఆడిపాడింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘లింగ’లో నటించింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

అయితే 2009లో కొడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి ఆమె కెరీర్ ను మలుపు తప్పింది. జేజెమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది అనుష్క. లేడీ ఓరియెంటల్ సినిమాలకు ఆస్కారం లేదని విమర్శలు వస్తున్న సమయంలో అరుంధతి ప్రభంజనం గట్టి జవాబుగా నిలిచింది. ఈ చిత్రం ఆమెకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ‘బిల్లా’ తర్వాత ‘వేదం’లో సరోజ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె నటనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు కూడా లభించింది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో ‘పంచాక్షరి’గా మెప్పించాలనుకున్నా ఫలించలేదు. మహేష్‌బాబుతో ‘ఖలేజా’ చేసింది. తమిళంలో సూర్యతో ‘సింగం’, ‘సింగం 2’ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ‘మిర్చి’ ‘బాహుబలి’ చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలిలో దేవసేన పాత్రలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది.

భారీ బడ్జెట్‌తో గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’గా కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం కోసం ఏకంగా రెండున్నర ఏళ్లు శ్రమించింది. ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగి తగ్గింది అనుష్క. ‘బాహుబలి 2’లో మళ్లీ దేవసేన పాత్ర కోసం బరువు తగ్గాల్సి వచ్చింది స్వీటికి. బహుశా సినిమాల కోసం ఇంతగా కష్టపడే హీరోయిన్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చూసి ఉండకపోవచ్చు. సినిమా ఇండస్గ్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు విషెస్ చెబుతున్నారు.

ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున చెప్పారు…మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చుస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌.

- Advertisement -