అందుకు సిద్ధంగా ఉన్నాను – అనుష్క

12
- Advertisement -

ఎమోషన్స్‌తో కూడిన క్లీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్ గా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ రిలీజ్ అయింది. హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. పైగా మూవీలో నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌ అద్భుతంగా ఉంది. అనుష్కకు ఇది మంచి కమ్‌ బ్యాక్‌ చిత్రంగా కూడా నిలిచింది. అన్నిటికీ మించి క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. దాంతో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’కి మంచి కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి. అన్ని భాషల్లో మొదటి రోజు ఈ చిత్రం రూ. 3 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ రోజు కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ఇప్పుడున్న బుకింగ్స్ ప్రకారం రెండో రోజు కూడా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ రూ.2 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఓ పక్క బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే.. మరోపక్క అనుష్క, నవిన్ పొలిశెట్టి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కూడా తన ఉనికిని చాటుకోవడం నిజంగా విశేషమే. అందుకే, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా శాటిలైట్ మ‌రియు డిజిట‌ల్ రైట్స్ కోసం గట్టిగానే పోటీ నడిచింది. ఫైనల్ గా ఈ చిత్రం తన డిజిటల్ పార్ట్‌న‌ర్‌ను ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌గా, ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛానెల్ జీ తెలుగు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది.

మొత్తానికి అనుష్కకి ఈ చిత్రం మంచి హిట్ ను ఇచ్చింది. ఇక అనుష్క ఈ సినిమా సక్సెస్ పై మాట్లాడుతూ.. ‘బాహుబలి’ సినిమా తర్వాత నాకు విశ్రాంతి అవసరం అనిపించింది. అందుకే సినిమాల్లో నటించలేదు. అందుకే ఎలాంటి కథలు వినలేదు. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలంటే విశ్రాంతి అవసరమనుకున్నా. ప్రస్తుతం నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సక్సెస్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని అనుష్క శెట్టి చెప్పుకొచ్చింది.

Also Read:క్యాబేజీ రసం తాగితే.. ఎన్నో లాభాలో!

- Advertisement -