అనుక్రీతికి మిస్ ఇండియా టైటిల్..

287
Femina Miss India 2018
- Advertisement -

ఫెమీనా మిస్‌ ఇండియా 2018 పోటీల్లో తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్‌ మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. ముంబైలో చిత్ర నిర్మాత కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరైన మిస్ ఇండియా ఫైనల్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుక్రీతి వాస్‌ అందాల సుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.

Anukreethy Vas

మొత్తం 30 మంది ఫైనలిస్టులతో పోటీ పడి అనుకీర్తి విజయం సాధించింది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కామవరపు శ్రేయారావు మూడో స్థానంలోనూ నిలిచారు. న్యాయమూర్తుల ప్యానల్ లో ఇండియన్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, బాలీవుడ్ సెలబ్రిటీలు మలైకా అరోరా, బాబీ డియోల్, కునాల్ కపూర్ లు ఉన్నారు.

ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ ల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విజయం సాధించిన అనుకీర్తికి, గత సంవత్సరం విజేత మానుషీ చిల్లర్ కిరీటాన్ని అలంకరించింది. ఇక అనుక్రీతి మిస్ వరల్డ్ 2018 పోటీలపై దృష్టిని పెడతానని మీడియాకు తెలిపింది. అనుక్రీతి 2018 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొంటారు. మిగతా ఇద్దరు 2018 మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌, మిస్‌ యునైటెడ్‌ కాంటినెంట్స్‌ పోటీల్లో పాల్గొంటారు.‌

- Advertisement -