ఆ వీడియోలు ఆమెను భయపెడతాయట

21
- Advertisement -

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సినీ తారల్లో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఐతే, కార్తీ నటించిన ‘జపాన్’ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా తాను హీరోయిన్ గా నటించిన జపాన్ పై అను ఇమ్మాన్యుయేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘జపాన్’ స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. అను ఇమ్మాన్యుయేల్ ఇంకా మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ రాజు మురుగన్ అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారని.. ఇలాంటి కథ ఇంతకు ముందెన్నడూ తాను వినలేదని, ఈ దీపావళికి ఇదే సరైన సినిమా అని.. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఓ అభిమానిగా తాను ఆతృతగా ఉన్నానని అను ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చింది.

అన్నట్టు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మా కమర్షియల్ యాడ్స్ తో కూడా బిజీగా ఉంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీనికోసం బాంబేలో నాలుగు రోజులు యాడ్ షూట్ లో కూడా అను ఇమ్మాన్యుయేల్ పాల్గొంది. పెద్దగా సినిమాలు లేకున్నా బ్రాండ్ వాల్యూతో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అను ఇమ్మాన్యుయేల్ తీసుకుంటుందని.. అందుకే ఆమె చెన్నైలో ఓ భారీ విల్లాను కొనుగోలు చేసింది అని అంటున్నారు. మొత్తమ్మీద బ్రాండ్ వ్యాల్యూతోనే అను ఇమ్మాన్యుయేల్ కోట్ల రెమ్యునరేషన్ ను అందుకుంటుంది.

ఇక పనిలో పనిగా స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో పై కూడా అను ఇమ్మాన్యుయేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రష్మిక వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్‌ గా మారింది. దీనిపై మీ స్పందన ఏమిటి ? అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ‘అలాంటి వీడియోలు తననెంతో భయపెడతాయి అని.. గతంలో తనకూ ఆ సమస్య ఎదురైంది అని, ఆ క్లిష్ట సమయంలో తన కుటుంబసభ్యులు, స్నేహితులు తనకు అండగా నిలబడ్డారు అని అను ఇమ్మాన్యుయేల్ చెప్పింది.

Also Read:రాజకీయాల చుట్టూ ఎన్టీఆర్ ‘దేవర 2’

- Advertisement -