టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ను కొట్టేసింది అను ఇమ్మాన్యూల్. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ సినిమాలో అను నటించింది. ఈ మూవీ బాక్సాపీసు వద్ద ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశకు లోనైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్సును కొట్టేసి ‘నా పేరు సూర్య’ సినిమాలో నటించింది.
ఈ మూవీతోనైనా ఓ హిట్ కొట్టాలనుకుంది. కానీ ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించపోవటంతో వరుస ఫ్లాప్లతో సతమతమవుతోంది. తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో విజయ్ దేవరకొండ పరుశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో అను అతిధి పాత్రలో కనిపించనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. దీనికి అను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమాలో నటిస్తోంది. వరుస వైఫల్యాలలో ఉన్న అను ఈ సినిమాతోనైనా విజయం సాధించాలకుంటోందట.