Mahesh:’గుంటూరు కారం’ మరో దెబ్బ

10
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో గుంటూరు కారం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె సినిమా షూటింగ్ మొదలుపెట్టగా కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. అయితే తర్వాత సినిమా షూటింగ్‌లో వేగాన్ని పెంచుదామనుకున్న వారికి ఎదురుదెబ్బ తగిలింది. మహేష్ బాబు వెకేషన్ కోసం ఫారెన్ వెళ్లిపోగా షూటింగ్‌కి గ్యాప్ వచ్చింది. అయితే మహేష్ లేని సన్నివేశాలను చిత్రీకరించాలని భావించారు త్రివిక్రమ్.

అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చి పడింది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న పిఎస్ వినోద్ తప్పుకుంటున్నట్టుగా చెప్పేసారు. ఎందుకు తప్పుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ట్రావెల్ చేస్తున్నారు వినోద్.

Also Read:పెళ్లికి ముందే ఆ కండిషన్ పెట్టాడట

వాస్తవానికి గుంటూరు కారం మొదలైనప్పటికి నుండి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. తొలుత మహేష్ సరసన పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఎంపిక చేయగా అనుకోని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. దీంతో పూజా ప్లేస్‌లో శ్రీలలని తర్వాత ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇక తమన్ సైతం ఈ ప్రాజెక్టుపై అంత ఆసక్తికనబర్చడం లేదని తెలుస్తోంది. మొత్తంగా ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు త్రివిక్రమ్ ఏ విధంగా ముందుకువెళ్తారో చూడాలి..

Also Read:తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ..దాశరథి

- Advertisement -