కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం

94
- Advertisement -

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించింది.

మహిళల 71 కేజీల విభాగంలో మొత్తం 212 కేజీల బరువు ఎత్తింది. స్నాచ్‌లో 93 కేజీలు ఎత్తిన కౌర్…. క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీలు ఎత్తి కాంస్య పతకం సాధించింది. కాగా భారత్‌కు ఇప్పటి వరకు మొత్తం 9 పతకాలు దక్కగా అందులో ఏడు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం.

- Advertisement -