సింగరేణి సీఎండీకి మరో అంతర్జాతీయ అవార్డు ..

259
singareni
- Advertisement -

సింగరేణి సీఎండీ శ్రీధరికి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక ఏసియా వన్ మ్యాగజైన్ భారతీయ మహంతం వికాస్ పురస్కార్ – 2019 అవార్డు కు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 7న బ్యాంకాక్ (థాయిలాండ్) లో అవార్డు స్వీకరించనున్నారు శ్రీధర్.

సింగరేణి సంస్థ ను అద్భుతమైన వృద్ధి రేటు తో జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం లో నిలిపినందుకు గుర్తింపుగా శ్రీధర్ కు ఈ అవార్డు వరించింది. బ్యాంకాక్ కేంద్రంగా ప్రచురితమవుతున్న ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఏసియా వన్ మరియు యు ఆర్ ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ ద్వారా ఆసియా ఖండం లో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఇచ్చే” భారతీయ మహంతం వికాస్ పురస్కార్ అవార్డు”కు శ్రీ ఎం శ్రీధర్ ను ‘ద లీడర్ ‘పేరుతో ఎంపిక చేశారు.

*ఈ అవార్డును బ్యాంకాక్ లో గల మారియట్ హోటల్ లో ఫిబ్రవరి 7న జరగనున్న పదమూడవ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో అందజేయనున్నారు. కంపెనీని సమర్థంగా నిర్వహిస్తూ అభివృద్ధి పదంలో ఉన్నతస్థాయికి చేర్చడం లోనూ, కంపెనీ వ్యాపార విస్తరణలో చురుకుగా వ్యవహరించినందుకు ఆసియా ఖండంలోనే ప్రతిభావంతమైన లీడర్ల లో ప్రముఖునిగా గుర్తిస్తూ ఈఅవార్డుకు ఎంపిక చేశారు. ఇది సింగరేనీయుల కృషికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు అని తెలిపారు శ్రీధర్.

- Advertisement -