కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి షాక్..మరో 8మంది ఎమ్మెల్యేల రాజీనామా?

270
Karnataka
- Advertisement -

కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై మరో ట్వీస్ట్ వెలుగులోకి వచ్చింది. నేడు బలనిరుపణకు చివరి రోజు కావడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ఇప్పటికే 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో చతికిలపడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 8మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకూ 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అనారోగ్యంతో ఉన్నానని, సభకు రాలేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్‌ చెప్పేశారు. దీంతో 16మంది బలనిరూపణకు దూరంగా ఉన్నట్టు కాగా, ఇప్పుడు మరో 8 మంది రిజైన్ యోచనలో ఉన్నట్టు వార్తలు రావడం కుమారస్వామికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. , ప్రస్తుతం రాజీనామా చేసిన 15 మందిలో అత్యధికంగా మైసూరు, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారే. ఆ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా బలం లేదు.

ఇక్కడ ఉప ఎన్నికలు జరిగితే విజయం అంత ఈజీ కాదని భావించిన బీజేపీ, తమకు బలమున్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 8 మందితో రాజీనామాలు చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బలనిరూపణ ఇంకాస్త ఆలస్యమైతే వీరంతా రాజీనామా చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ బలనిరూపణకు చివరి రోజు కావడంతో ఏం జరుగుతందో అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -