తెలంగాణ‌లో మ‌రో ముగ్గురికి క‌రోనా పాజిటివ్

269
corona
- Advertisement -

క‌రోనా వైర‌స్ బాధితులు రోజురోజుకి పెరిగిపో్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే 3ల‌క్ష‌ల మందికి ఈ వ్యాధి సోక‌గా అందులో 13వేల మంది మ‌ర‌ణించారు. మ‌న దేశంలో కూడా క‌రోనా విజృంభిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు 440 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 7గురు మ‌ర‌ణించారు. ఇక తెలంగాణ‌లో రోజు రోజుకి క‌రోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.

తాజాగా తెలంగాణ‌లో మ‌రో ముగ్గురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది. జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. సౌదీ అరేబియా నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే లండన్‌ నుంచి వచ్చిన కూకట్‌పల్లి వాసికి కూడా కరోనా నిర్ధారణ అయింది.క‌రోనా వ్యాప్తికి మార్చ్ 31వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించింది తెలంగాణ ప్ర‌భుత్వం.

- Advertisement -