అన్నపూర్ణ స్టూడియోస్.. ‘జపాన్’

42
- Advertisement -

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్‌’ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.

‘జపాన్‌’ దీపావళికి విడుదలవుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కి దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాజెక్ట్ లోకి రావడంతో సినిమా గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్ హామీ ఇచ్చింది. జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్, కథాంశంగా కనిపిస్తోంది. ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్‌ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు.

కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ రవి వర్మన్ టీజర్ లో క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌లు బ్రిలియంట్ గా ఉండగా, జివి ప్రకాష్ కుమార్ తన బిజిఎమ్‌తో వాటిని మరింత ఎలివేట్ చేశారు.ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -