రామగుండంలో వలసకూలీలకు అన్నదానం..

201
Ramagundam cp
- Advertisement -

సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని బస్ స్టాండ్ లో వలస కూలీలకు అన్నదానం చేశారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పనులు లేక ఆర్థికంగా నష్ట పోయి తమ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు భోజనాలను అందించారు.

కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ ద్వారా వలస కార్మికులను గుర్తించి ఆకలితో సరిహద్దులు దాటకుండా భోజనము, సదుపాయాలు కల్పించి, వారి వారి రాష్ట్రాల అధికారులతో మాట్లాడి స్వగ్రామాలకు పంపించడం జరుగుతుందని సిపి అన్నారు.

అదేవిధంగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ వలస కార్మికుల కడుపులు నింపడానికి మరియు ఆకలిని తీర్చడానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -