రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం

183
anil
- Advertisement -

రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అనిల్ కుర్మాచ‌లం, రాష్ట్ర రెడ్కో చైర్మ‌న్‌గా వై స‌తీష్ రెడ్డి నియామ‌కం అయ్యారు. వీరిద్ద‌రూ త‌మ ప‌ద‌వుల్లో మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అనిల్ కుర్మాచలం ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. స‌తీష్ రెడ్డి ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్నారు. సతీష్ రెడ్డి 1981, ఆగ‌స్టు 25న ములుగు మండలం దేవగిరిపట్నంలో జ‌న్మించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయ‌కుడిగా చేరి.. ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు . 2020 నుంచి టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్నారు.

- Advertisement -