హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గలాట..సహచర కానిస్టేబుల్ పై దాడి

537
appolice
- Advertisement -

ఏపీ పోలీసుల బండారం మరోసారి బట్టబయలైంది. తొటి కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీస్ జీపు నుంచి కిందకు దూకిన కానిస్టేబుల్ మధును బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు మరో నలుగురు పోలీసులు. దీంతో తనను వదిలేయమంటూ వేడుకున్నాడు కానిస్టేబుల్ మధు.

కాసేపు రోడ్డుపైనే తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను బలవంతంగా విజయవాడకు తరలిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మధు. కానిస్టేబుల్ మధు ఎపిఎస్పీ 11వ బెటాలియన్ కు చెందిన వాడు. రోడ్డుపై జరిగిన ఈగొడవ మొత్తాన్ని అక్కడున్న స్ధానికులు వీడియో తీయడంతో పోలీసులు అక్కడి నుంచి పరారయ్యారు.

- Advertisement -