మంగళగిరిలో ఓటుకు రూ.30వేలుః విజయసాయిరెడ్డి

209
Vijaysai_Reddy_
- Advertisement -

ఎప్రిల్ 11 తొలి విడత సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో ఏపీ రాజకీయం వేడెక్కెంది. ఏపీలోని ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. వైసిపి సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ట్వీట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరిలో ఒక్క ఓటుకు రూ.30వేలు ఇస్తున్నారని ట్వీట్ చేశారు. ఇప్పటికే పెంచిన 10 కాక మరో 20 వేలు ఇస్తామని కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చెబుతున్నారట.

ప్రజలేమో లోకేశ్‌ బాబు ఓటుకు 50 వేలు ఇవ్వమంటే మీరు మధ్యలో బొక్కి మా మొఖాన 10వేలు కొడతారా అని తరుముతున్నారట. మందలగిరిని ఏం చేయాలనుకుంటున్నాడో మాలోకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్ చేస్తూ చంద్రబాబు హెరిటేజ్ పాల వ్యాన్లు, ఎల్లో మిడియా ఓబీ వ్యాన్లలో డబ్బులు తరలిస్తున్నారని తెలిపారు.

- Advertisement -