మంగళగిరిలో లోకేష్ ఆధిక్యం… ఏపీలో ఎవరూ ఆధిక్యంలో ఉన్నారంటే?

265
Nara Lokesh
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో కౌంటింగ్ ఉత్కంఠ రేపుతుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరా హోరీ నెలకొంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదట బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తున్నారు. ఇక ఏపీ సీఎం కుమారుడు మంత్రి లోకేష్ పోటి చేసిన మంగళగిరిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఇక చీపురుపల్లిలో వైసిపి నేత బొత్స సత్యనారాయణ లీడ్ లో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. భీమిలిలో టీడీపీ నేత సబ్బం హరి ఆధిక్యంలో ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, బొబ్బిలిలో టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, అరుకులో కిడారి శ్రవణ్ కుమార్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురంలో టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -