ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే….

330
AP Budget 2020
- Advertisement -

ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెటను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్ ఇవే….

ఏపీ బడ్జెట్ 2020-21:

బడ్జెట్ అంచనా వ్యయం – రూ. 2,24,789.18 కోట్లు
రెవెన్యూ అంచనా వ్యయం – 1,80,392.65 కోట్లు
మూలధన అంచనా వ్యయం – 44,396.54 కోట్లు

సవరించిన అంచనాలు 2019-20:

రెవెన్యూ వ్యయం – రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం – రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 26,646.92 కోట్లు

వివిధ పథకాలకు కేటాయింపుల వివరాలు:

ఆరోగ్య రంగానికి – 11,419.44 కోట్లు
హోం శాఖకు – రూ. 5,988.72 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి – రూ. 1,279.78 కోట్లు
ఐటీ రంగానికి – రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి – రూ. 601.37 కోట్లు
జలవనరుల శాఖకు – రూ. 11,805.74 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి – రూ. 16,710.34 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి – రూ. 696.62 కోట్లు
వ్యవసాయ రంగానికి – రూ. 11,891 కోట్లు
వైయస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి – రూ. 500 కోట్లు
వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ – రూ. 3,615.60 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం – రూ. 1,100 కోట్లు
104, 108 పథకాలకు – రూ. 470.29 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు – రూ. 2,277 కోట్లు
ప్రాథమిక, ఇంటర్ విద్యకు – రూ. 22,604 కోట్లు

- Advertisement -