శాంతాక్లాజ్‌ అవతారమెత్తిన యాంకర్‌ శ్యామల

235
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగ క్రిస్మస్‌. ప్రతియేటా డిసెంబర్‌ 25వ తేదీన క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులు నెలరోజుల ముందునుంచే సన్నద్ధమవుతతారు. నగరంలోని చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. మార్కెట్‌లో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తున్నది.

అయితే క్రిస్మస్‌ అంటేనే మనకు టక్కున గుర్తొచ్చేది శాంతాక్లాజ్‌… క్రిస్మస్‌ పండుగొచ్చిందంటే చాలు.. సెలెబ్రెటీలు శాంతా క్లాజ్‌ వేషంతో అలరిస్తారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల సైతం క్రిస్మస్‌ వేడుకల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా శ్యామల తన ఇంట్లో క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటు చేయడంతో పాటు శాంటా వేషంతో పోటోలకు ఫోజిచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

- Advertisement -