మంత్రి కేటీఆర్‌కు అనసూయ ట్వీట్

142
anasuya
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో స్కూల్స్‌ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిల్లలు స్కూల్‌కు వచ్చే విషయంపై వారిని బలవంతం చేయవద్దని సూచించినా కొన్ని పాఠశాలల తీరు మారడం లేదు.

ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సినీ నటి అనసూయ…మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ కేటీఆర్‌కు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్‌ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్‌.. ఇదెక్కడి న్యాయం? మీరు ఈ విషయంలో సమీక్షిస్తారని భావిస్తున్నాను అని పేర్కొన్నారు అనసూయ.

- Advertisement -