జీఎస్టీ సోదాలు..మీడియాపై సుమ,అనసూయ ఫైర్

630
anasuya
- Advertisement -

తమ నివాసాల్లో జీఎస్టీ సోదాలు జరిగాయన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు యాంకర్‌ సుమ, అనసూయ. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన సుమ జీఎస్టీ సోదాల గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఒక వేళ తన నివాసంలో సోదాలు జరిగితే ఎక్కడ..? ఏ నివాసంలో జరిగాయో చెప్పాలన్నారు. తాను క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నానని దీనికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని చెప్పారు. తాను ఈ స్ధాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని ఇలాంటి చెత్త వార్తలు రాసే ముందు మీడియా వారు పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంజారాహిల్స్ లోని తన నివాసంలో సోదాలు జరగలేదని ఈ వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు యాంకర్ అనసూయ. మీడియా సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికే తప్ప తమ వ్యక్తిగత అభిప్రాయాలను అందించడానికి కాదన్నారు. ఇండస్ట్రీలో ఈ స్ధాయి చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశామని సరైన సమాచారాన్ని తెలుసుకున్నాకే ప్రజలకు వార్తలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -