ఆ నిర్మాతతో ఆమె గోక్కోవడమే ఇది

32
- Advertisement -

యాంకర్ ‘అనసూయ’కు నోటి దురుసు ఎక్కువ. ఈ క్రమంలోనే కొన్ని సైట్లు, చానెళ్లు గతంలో ఆమెను టార్గెట్ చేశాయి. ఆమెకు బలుపు ఎక్కువ అని, అది ఎక్కువ – ఇది ఎక్కువ అంటూ ఆమెను తిట్టేశాయ్… అందుకు తగ్గట్టుగానే అనసూయ కూడా ట్విట్టర్ లో రెచ్చిపోతూ ఉండేది. ఐతే, రీసెంట్ గా ఓ సినిమా సెట్ లో జరిగిన గొడవ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో రూమర్లు వినిపిస్తున్నాయి. అనసూయ ఓ సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాలో ఆమెది నెగిటివ్ క్యారెక్టర్. ఆ సినిమా బృందంలోని వారంతా కాస్త దురుసుగా ప్రవర్తించే నైజం ఉన్నవాళ్లు. దాంతో మొదటి రోజు నుంచి అనసూయకు ఆ టీమ్ కు సెట్ అవ్వలేదు.

దీనికితోడు సదరు సినిమా ప్రొడ్యూసర్ కూడా కొత్తవాడు. పైగా రాయలసీమకు చెందిన వ్యక్తి. అనసూయ ప్రవర్తన అతనికి నచ్చలేదు. దాంతో ఆమెకు రెమ్యునరేషన్ ను కూడా ఆపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనసూయ సీరియస్ అయినట్లు ఉంది. అనసూయ ఏం అన్నది ?, ఆ నిర్మాత ఏమన్నాడు..? తెలియదు గానీ, అనసూయ మాత్రం షూటింగ్ మధ్యలో నుంచే వెళ్ళిపోయింది. అదేం అంటే.. కంటెంట్ సరిగ్గా కుదరాలి, సీన్ సరిగ్గా రావాలి తప్ప, కేవలం ఎక్స్ పోజింగ్ చేస్తే జనం సినిమాని చూడరు అంటూ అనసూయ మధ్య వ్యక్తులతో చెబుతుందట. బహుశా అనసూయ చెప్పింది నిజమే కావచ్చు,

కానీ, మధ్యలో షూటింగ్ నుంచి వచ్చేసి.. ఇక ఆ సినిమా చేయను అంటే ఎలా ?, కాస్త అణకువగా, వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. లేదు అంటే.. కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్టే. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. ఒకరకంగా నిర్మాతను అనసూయ తీసిపారేయడమే. వీళ్లిద్దరి కలయికలో జరిగిన గొడవ గురించి పక్కన పెడితే.. సినిమాలో సగం నటించి ఇక నటించను అనడం మాత్రం తప్పే. ఏమాటకామాట, అనసూయ ఇలా చేయడం కరెక్టు కాదు. మరి చూడాలి, ఈ వివాదం ఎటు పోతుందో.

Also Read:సందీప్ కిషన్…ఊరు పేరు భైరవకోన

- Advertisement -