నెటిజన్‌పై అనసూయ ఆగ్రహం..

292
- Advertisement -

బుల్లితెరపై యాంకర్‌గా చక్కటి గుర్తింపును సొంతం చేసుకుంది అనసూయ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గ్లామర్ సొగసులతో ఆకట్టుకున్న ఆమె కొద్దికాలంలోనే తనదైన ముద్రను వేసింది. అందచందాలతో రాణించవొచ్చని నిరూపించింది. బుల్లితెరపై చక్కటి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు కమర్షియల్ విజయాలతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టినా కెరీర్‌కు మాత్రం ఉపయోగపడలేదు. ఆశించిన స్థాయిలో అవకాశాల్ని అందివ్వలేదు. దాంతో తన రూటును మార్చిన ఆమె గ్లామర్ బాట పట్టింది. తన అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.

అయితే అన‌సూయ తాజాగా ఓ నెటిజ‌న్‌పై మండిప‌డింది. అన‌సూయ‌ ధరిస్తున్న దుస్తులు అభ్యంతరక‌ర‌మ‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన‌డంతో అత‌డికి క్లాస్ పీకింది. తాజాగా అన‌సూయ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానిపై స్పందించిన ఓ నెటిజ‌న్.. అన‌సూయ‌కు ఏమైనా సెన్స్‌ ఉందా? అని కామెంట్ చేశాడు. ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటి? అని నిల‌దీశాడు. కుటుంబంతో కలిసి తాము టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నామ‌ని పేర్కొన్నాడు. ఆ కామెంట్ చూసిన అన‌సూయ‌కు కోపంతో ఊగిపోయిందట.

Anchor Anasuya has been trolled on Instagram

ఆ కామెంటుకు బదులిస్తు..’అలాగైతే ఆ ప్రోగ్రాంల‌ను చూడ‌కు అంటూ సలహా ఇచ్చింది. కుటుంబ విలువలపై అంతగా పట్టింపు ఉన్న వ్య‌క్తి ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదని హిత‌వుప‌లికింది. ఇతరులు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో ఇలా చెప్ప‌కూడ‌ద‌ని పేర్కొంది. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన త‌న‌లాంటి పబ్లిక్‌ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను తీసుకోవ‌ద్ద‌ని ఘాటుగా క్లాస్ పీకింది. తాను ఏ దుస్తులు వేసుకోవాలో త‌న‌కు తెలుస‌ని, మ‌నుషులు ఏం చూడాలనుకుంటే అదే చూస్తారని తెలిపింది. చిన్నారుల‌పై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయని, 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని అనసూయ ప్ర‌శ్నించింది. వారేం ఎక్స్‌పోజింగ్ చెయ్య‌రు క‌దా? అని నిల‌దీసింది. ఇత‌రులకు ఇటువంటి సూచ‌న‌లు చేయొద్ద‌ని, ‘నీ ప‌ని నువ్వు చూసుకో’ అని మెత్తగా చురక అంటించింది.

- Advertisement -