‘కోటి వృక్షార్చన’.. యాంకర్ అనసూయ పిలుపు..

214
Anasuya
- Advertisement -

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన.. ఒకేరోజు ఒక గంటలో 1కోటి మొక్కలు నాటే హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంపీ సంతోష్‌. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ అనసూయ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుదాం అని పిలుపునిచ్చారు.

ఈ రాష్ట్రం నాకెమిచ్చిందని కాదు ఈ రాష్ట్రానికి నేనేమిచ్చామని ఆలోచిస్తున్నారా.. అయితే రండి మన భావితరాల కోసం.. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యాన్ని తగ్గించే ఉన్నతాశయంలో మన వంతు ప్రయత్నంగా ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి వృక్షార్చనలో పాల్గొందాం. ప్రతీ ఒక్కరం మూడు మొక్కలను నాటుదాం అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ సత్సకల్పంలో పాల్గొనే వారు పూర్తి వివరాల కోసం 9000 365 000 మొబైల్ నెంబర్ కి GIC అని వాట్సప్ మేసేజ్ పంపండి.

- Advertisement -