ప్ర‌తి మ‌హిళ హీరోయినే-అన‌సూయ‌

228
Anasuya Bharadwaj
- Advertisement -

బులితెరపై యాంక‌ర్‎గా రాణిస్తూనే, వెండితెర‌పై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంక‌ర్ అనుసూయ‌.రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌ పాత్ర చేసి విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాతో అమ్మ‌డుకి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అయితే తాజాగా ఆమె విశాఖ‌ప‌ట్నంలో ఓ షాపింగ్ మాల్‎ను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

Anasuya

తాను హీరోయిన్‎కు త‌క్కువ కాద‌ని.. ప్ర‌స్తుతం త‌న‌ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయ‌ని చెప్పింది. అస‌లు ధైర్యంగా ముందుకు వెళ్లే ప్ర‌తి మ‌హిళ హీరోయినే అంటూ చెప్పుకొచ్చింది. తాను ఎక్క‌డికి వెళ్లినా..రంగ‌మ్మ‌త్త అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు అటు బులితెర‌ యాంకర్‎గా… ఇటు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతోంది. రంగ‌మ్మ‌త్త‌గా మంచి పేరు వ‌చ్చిన త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి ఫారెన్ ట్రిప్‎లో ఫుల్ ఎంజాయ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -