- Advertisement -
బుల్లి తెర,వెండి తెరపై తనదైన శైలీలో నటిస్తూ మెప్పిస్తున్న బ్యూటీ అనసూయ. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ..ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా హాలీడే ట్రిప్కు వెళ్లడం కామన్.
తాజాగా తన ఫ్యామిలీతో కలిసి జంగల్ సఫారీకి వెళ్లారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. తన ఫ్యామిలీతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను అభిమానులతో పంచుకున్నారు అనసూయ. ప్రకృతి లేకుండా బతకలేనని…ఈ టూర్లో చాలా జ్ఞాపకాలు నా హృదయంలో ఉన్నాయని చెప్పుకొచ్చింది అనసూయ.
- Advertisement -