ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిల మధ్య జరిగే ప్రేమకథ!

209
ANAGANAGANA Film Company
- Advertisement -

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సలహాలతో అనగనగా ఫిల్మ్ కంపెనీ సంస్థ ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రానికి శ్రీకారం చుట్టింది.  పూజా.కె.దోషి హీరోయిన్‌గా , హరీష్ కల్యాణ్, సాయిరోనక్ హీరోలుగా నటిస్తున్న  ఈ చిత్రాన్ని  అనగనగా ఫిల్మ్ కంపెనీ పతాకంపై పట్టాబి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదొక సింపుల్ లవ్‌స్టోరీ, ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిల మధ్య జరిగే ఈ ముక్కోణపు ప్రేమకథలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి.
ANAGANAGANA Film Company
ఇప్పటి వరకు ఎనభైశాతం షూటింగ్ పూర్తయింది.కొత్త పాత నటీనటుల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్తదనం ఆశించేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో రెండు ప్రీలుక్ పోస్టర్స్‌ను ఈ నెల 12, 13 తేదిలలో విడుదల చేసి, ప్రేమికుల దినోత్సవం రోజున చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. పూజా.కె.దోషి, హరీష్ కల్యాణ్, సాయిరోనక్, మోహన్మ్రన్, డా.మంజరి షర్మీల, సంధ్య జనక్, భాను అవిర్నేని, సుదర్శన్, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్.వి.జోసెఫ్, సంగీతం: ప్రసన్న్, ప్రవీణ్, శ్యామ్, ఎడిటింగ్: మర్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగా, లైన్ ప్రొడ్యూసర్: పి.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం-నిర్మాత: పట్టాబి.ఆర్.చిలుకూరి.

- Advertisement -