కరోనా నుండి కోలుకున్న బిగ్ బి అమితాబ్..

172
amitabh
- Advertisement -

కొద్దిరోజుల క్రితం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఆస్పత్రిలో చేరినప్పటికి దగ్గరి నుండి తన ఆరోగ్య పరిస్దితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్న అమితాబ్‌..పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్ తనయుడు అభిషేక్ నిర్వహించిన పరీక్షల్లో మళ్లీ పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన అమిత్ షా…తాను బాగానే ఉన్నానని… వైద్యుల సూచనమేరకే దవాఖానలో చేరాను. కొన్నిరోజులుగా నన్ను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోండి. ఐసోలేషన్‌లో ఉండాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కర్ణాటక సీఎం యెడియూరప్పకు, తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా కరోనా బారీన పడ్డారు. కరోనా మహమ్మారితో ఉత్తరప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్‌రాణి వరుణ్‌ (62 కన్నుమూశారు. యోగి ఆధిత్యనాథ్‌ మంత్రివర్గంలో ఏకైన మహిళా మంత్రి కమల్‌రాణి.

- Advertisement -