అమితాబ్‌ కు మరోసారి కరోనా

25
amitabh
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోన్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం సోనీటీవీ రూపొందిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు అమితాబ్. ఆయన మరోసారి కరోనా బారినపడటంతో అభిమానులతోపాటు బాలీవుడ్‌లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 2020 జులై 11న అమితాబ్‌కు మొదటిసారిగా కరోనా సోకిన విష‌యం తెలిసిందే.

- Advertisement -