ఆ నిర్మాతలకు క్లాస్‌ పీకిన అరవింద్‌..

220
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ వ్యహారశైలియే వేరు. తాను నిర్మించే సినిమాల బడ్జెట్ విషయంలో చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు కూడా. ఇదే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే..అల్లుఅరవింద్ బ్యానర్ పై నిర్మించే సినిమాలకు ఎంత బడ్జెట్ అవసరమో, అంతే ఖర్చు పెడతాడన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి.
Allu Arvind Warns producers on Mister result before release
అయితే గతవారం రిలీజైన మిస్టర్ మూవీ నిర్మాతలకు అల్లు అరవింద్ పెద్ద క్లాస్ పీకాడట. కారణం…’మిస్టర్‌’ కి పెట్టిన భారీ బడ్జెట్టేని తెలుస్తోంది. దీనిపై టాలీవుడ్ లో జోరుగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘మిస్టర్’ మూవీ రిజల్ట్.. ఫ్లాప్ అని తేలిపోవడంతో ఈసినిమాకు ఆ పరిస్థితి ఎందుకొచ్చిందన్న  విషయమై ప్రస్తుతం తెగ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఆ రూమర్లే…ఈమూవీకి మితిమీరిపెట్టిన ఖర్చు అని, ఇదే ఈ సినిమాకి శాపంగా మారింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కాకుండా చిన్న బడ్జెట్ తో తీసి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని అరవింద్‌ అన్నట్లు సమాచారం. దీనికితోడు శ్రీనువైట్ల ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడనే విషయం అర్ధమైనా.. నిర్మాతలు మౌనం వహించడం ‘మిస్టర్’ మూవీ ఫెయిల్యూర్ కు మరొక కారణం అంటూ..కొంచెం గట్టిగానే అరవింద్‌ మాట్లాడాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు అనవసరంగా పెరిగిపోయిన క్యాస్టింగ్ లోకేషన్స్ కూడా ‘మిస్టర్’ ను దెబ్బతీశాయని అంటున్నారు. దీంతో మిస్టర్‌ రిజల్ట్‌ తో నిర్మాతలు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
 Allu Arvind Warns producers on Mister result before release
ఇదిలా ఉంటే..టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన నల్లమలుపు శ్రీనివాస్ పరిస్థితి ఈసినిమా ఫెయిల్యూర్ తో మరింత సమస్యగా తయారైందన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.

‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్ తీసిన ఈ నిర్మాత ‘ముకుంద’ ‘విన్నర్’ ప్రస్తుతం ‘మిస్టర్’ ఇలా మెగా యంగ్ హీరోలను నమ్ముకున్నా..  పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ‘మిస్టర్’ మూవీతో శ్రీనువైట్ల, వరుణ్ తేజ్, నల్లమలుపు శ్రీనివాస్ ల పరిస్థితిని అయోమయంలో పడేసిన రికార్డును ఈసినిమా సొంతం చేసుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -