పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు..బన్నీ ట్వీట్

554
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తన తాతయ్య అల్లు రామలింగయ్యతో కలిసి దిగిన 29ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేశారు. తన తాతయ్య తో తీపి గుర్తులను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలో అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు. అల్లు అర్జున్, అల్లు శీరిష్, అల్లు వెంకట్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.

‘పద్మశ్రీ అందుకుని తిరిగి వస్తున్న తాతయ్యకు స్వాగతం పలకడానికి మేమంతా విమానాశ్రయానికి వెళ్లాము. పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు.. అద్భుత ప్రయాణం’ అని అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. అల్లు రామలింగయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు.

కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయనకు ‘పద్మశ్రీ ‘అవార్డు ప్రదానం చేసి గౌరవించింది. 2001లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును కూడా అందుకున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల..వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ 2020 సంక్రాంతి 12న విడుదల కానుంది. ఈసినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి.

Allu Arjun’s throwback moment with his Grandfather Allu Ramalingaiah

- Advertisement -