సమతామూర్తి సన్నిధిలో బన్నీ..

51
allu
- Advertisement -

ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిలో సందడి చేశారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ, అక్కడి విశేషాలను వివరించారు. ఇక అల్లు అర్జున్ ను చూసిన జనం ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవి,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమతామూర్తిని దర్శించుకోనున్నారు. రేపు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దర్శించుకోనున్నారు. రేపటితో సహస్రాబ్దిఉత్సవాలు ముగియనున్నాయి.

- Advertisement -