2020..రెండు సినిమాలతో రానున్న బన్నీ ..!

666
allu arjun
- Advertisement -

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు బన్నీ.

ఇప్పటికు షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం 2020 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక సుకుమార్ తో చేస్తోన్న సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. గతంలో సుకుమార్…వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో చిత్రాలను రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడట.

సుకుమార్‌తో సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాలని భావిస్తున్నారట అల్లు అర్జున్. అల వైకుంఠపురములో రిలీజ్ తరువాత తన కొత్త సినిమా వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -