అల్లు అర్జున్ మా శత్రువే!

17
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి జై కొట్టారు అల్లు అర్జున్. తన మిత్రుడు శిల్పారవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీటే మెగా ఫ్యామిలీలో తీవ్ర దుమారాన్ని రేపింది.

మాతోనే ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు, మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడేనని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బన్నీని ఉద్దేశించి చేసిందేనని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది. అయితే దీనిని నాగబాబు కార్యాలయం ఖండించినా బన్నీ గురించేనన్న రూమర్ మాత్రం ఆగడం లేదు.

Also Read:పుష్ప 2 కోసం ఫాహద్ ఫుల్ బిజీ!

తన మిత్రుడి గెలుపు కోసం వచ్చానని చెప్పినా వివాదం చల్లారలేదు. మెగా కుటుంబంలో సైతం అల్లు అర్జున వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున పర్యటనకు ముందుస్తు అనుమతి లేకపోవడంతో ఆయనపై కేసు నమోదైంది.

- Advertisement -