బన్ని అభిమానులకు గుడ్ న్యూస్..మహేశ్ కంటే ముందుగానే?

498
Allu Arjun Mahesh Babu
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా…తమన్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ , హరికా అండ్ హాసిని బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈమూవీ సాంగ్స్ భారీగా విజయం సాధించాయి. కాగా ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈమూవీపై భారీగా అంచనాలున్నాయి.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం జనవరి 12కంటే ముందే ఈసినిమాను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసేశాడట. సినిమా ఒక రేంజ్ లో ఉండటంతో బన్నీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని సమాచారం. దీంతో బన్నీ ఈమూవీని జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే జనవరి 11న మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కానుంది.

మొదట ఈచిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరు నిర్మాతలు రాజీకి వచ్చి మహేశ్ సినిమాను ఒక రోజు ముందు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు బన్నీ జనవరి 10న విడుదల చేయాలని చెప్పడంతో ఆలోచనలో పడ్డారట నిర్మాతలు. అల..వైకుంఠపురంలో మూవీ విడుదలపై త్వరలోనే క్లారిటి రానుంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

- Advertisement -