పుష్పరాజ్‌ గోరు వెనుక కథ అదే

35
- Advertisement -

‘పుష్ప – 2’ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల చేస్తామని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో అల్లు అర్జున్‌ వేలు గోరు హైలైట్‌ చేస్తూ చూపించారు. ఇప్పుడు ఈ గోరుపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎర్రచందనం వ్యాపారాన్ని పుష్పరాజ్‌ తన చిటికెన వేలుపై నిలబెట్టి నడిపిస్తాడని సూచనగా సుకుమార్‌ వేలు గోరును హైలైట్‌ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. తాము సంపన్నులమని చెప్పుకోవడానికి కూడా ఇలా గోరును పెంచుకుంటారట. మొత్తానికి పుష్ప రాజ్ గెటప్ అండ్ సెటప్ పై కూడా ఈ రేంజ్ లో వార్తలు వైరల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.

‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, మరోవైపు బన్నీ అభిమానులు హీరో రామ్ పోతినేని పై సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా..?, పుష్ప 2కు ఫేమస్‌ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్‌ మై షోలో 100K ఇంప్రెషన్స్‌ రాగా.. స్కంద ఆ మార్క్‌ను బీట్‌ చేసింది. టికెటింగ్ ప్లాట్‌ఫాంలో స్కంద 100Kకు పై ఇంప్రెషన్స్‌ రాబట్టి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. దీంతో రామ్ ఫ్యాన్స్ బన్నీ కంటే మా హీరోనే తోపు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఐతే, ఈ పోస్ట్ లు వెనుక రామ్ ఉన్నాడని.. రామ్ తన టీమ్ తో కావాలనే ఈ పోస్ట్ లు పెట్టిస్తున్నాడు అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే పీటర్‌ హెయిన్స్‌ భారీ సెట్స్ కూడా వేశారు.

Also Read:Prabhas:సలార్ వాయిదా

- Advertisement -