అల..వైకుంఠపురంలో ప్రమోషన్స్….గెస్ట్ గా సూపర్ స్టార్

410
ala vaikuntapuramlo
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కికన ఈచిత్రాన్ని రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఇటివలే విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈమూవీని మాలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు.

త్వరలోనే కేరళలో అల..వైకుంఠపురంలో ప్రీ రీలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మలయాళ వెర్షన్‌కు సంబంధించిన డబ్బింగ్ ఇతరత్రా అన్ని పనులు పూర్తైయ్యాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఇటివలే హైదరాబాద్ లో లైవ్ మ్యూజిక్ కాన్సట్ తో ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదల కాబోయే ఈసినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -