గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌‌పై మంత్రి అల్లోల‌ విచారం..

222
Allola Indrakaran Reddy On Vizag Gas Leak Incident
- Advertisement -

విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌‌పై రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

విశాఖ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ ను ఆదేశించారు.

- Advertisement -