జిమ్నాస్టిక్ అరుణరెడ్డిని కలిసిన శాట్స్ ఛైర్మన్

122
sats
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ కు చెందిన జిమ్నాస్టిక్ క్రీడాకారిణి కుమారి బుద్ధ అరుణ రెడ్డి ని హర్యానా రాష్ట్రం లోని అంబాల లో గల వార్ హీరోస్ మెమోరియల్ స్టేడియం లో కలిశారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి.

హర్యానా రాష్ట్రం లోని అంబాల పట్టణం ఢిల్లీ నుండి 230 కిలోమీటర్ల దూరంలో కలదు. జపాన్ లో వచ్చే నెల అక్టోబర్ 18 వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్ లో టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనడానికి ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు గల ఇండియన్ టీం లో వచ్చే నెల అక్టోబర్ 12 వ తేదీన జపాన్ కు వెళుతున్నారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి…బుద్ధ అరుణ రెడ్డి కి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.ఈ అమ్మాయి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. రెండు సార్లు జిమ్నాస్టిక్ క్రీడలో పెద్ద గాయాల నుండి కోలుకుంది అని ఛైర్మన్ గారు అన్నారు.

బుద్దా అరుణ రెడ్డి గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్ లో మెడల్ సాధిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రెండు కోట్ల ఆర్థిక సహాయం చేశారని ఈ సందర్భంగా ఛైర్మన్ గారు తెలిపారు.

మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కి ఎంపిక కావడం తెలంగాణ కు గర్వ కారణం అని, రానున్న రోజుల్లో ఏషియన్ గేమ్స్ కి, కామన్వెల్త్ గేమ్స్ కి, ఒలింపిక్ గేమ్స్ కి ఎంపిక అయి మెడల్ సాధించే ఆస్కారం ఉంది అని ఛైర్మన్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోచ్‌లు మనోజ్ రాణా, సత్ పాల్ చబ్రూ, పారమౌర్ సింగ్, శ్రీమతి.అంజు దువా (అర్జున అవార్డు గ్రహీత) తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -