శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్..

269
- Advertisement -

నాంది సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు హీరో అల్లరి నరేష్. దాదాపు ఎనమిది సంవత్సరాల తర్వాత హిట్ కొట్టడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నరేష్‌. ఈ సందర్భంగా మాట్లాడిన నరేష్…శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పారు. గ‌త ఏడాది కోవిడ్ వ‌ల‌న ద‌ర్శించుకోలేక‌పోయాన‌ని ..ప్ర‌స్తుతం తాను రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్టు పేర్కొన్నాడు.

అంతకముందు విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా., ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -