నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

92
kcr
- Advertisement -

గులాబీ నేతలకు గుడ్ న్యూస్..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మైనార్టీ కమిషన్‌తో పాటు ఎస్సీ,ఎస్టీ కమిషన్లకు ఛైర్మన్లను నియమించనున్నారు. వీటితో పాటు మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను భర్తీ చేయనున్నారు.

మైనార్టీ కమిషన్ ఛైర్మన్‌గా అబిద్ రసూల్ ఖాన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పిడమర్తి రవిలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 60కి పైగా కార్పొరేషన్లు ఉండగా ఇప్పటివరకు 25 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది ప్రభుత్వం.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు కట్టబెట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఆశావాహుల జాబితా సీఎం దగ్గరకు చేరగా సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు ఇవ్వనున్నారు సీఎం.

- Advertisement -