పోలియో రహిత దేశంగా భారత్..

15
- Advertisement -

పోలియో రహిత దేశంగా భారతదేశం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చివరిగా పోలియో కేసు నమోదైంది. పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణ 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలో చివరి కేసు 2007లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నమోదైంది. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మార్చి 4, 5 తేదీల్లో ఇంటింటికి జరిగే కార్యాచరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగర ప్రాంతాల కారణంగా 6 మార్చి 2024న 4వ రోజు కార్యకలాపాలను నిర్వహిస్తుంది.పల్స్ పోలియో క్యాంపెయిన్ సందర్భంగా హై రిస్క్ గ్రూపుల పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

0 నుండి 5 సంవత్సరాల పిల్లలు 40,57,320 మంది ఉన్నారని అంచనా. ప్లాన్ చేసిన పోలియో బూత్‌ల సంఖ్య 22,445. మొబైల్ బృందాల సంఖ్య 910గా ఉండగా ట్రాన్సిట్ పాయింట్‌ల సంఖ్య 910. రూట్ సూపర్‌వైజర్ల సంఖ్య 2245గా ఉండగా ఏ ఎన్ ఎం లు సంఖ్య 8754.అశాలు సంఖ్య 28160 మంది ఉండగా 50,30,000 పోలియో డోస్ లు అందుబాటులో ఉంచారు.

Also Read:జింక్ లోపమా..ఇవి తినండి!

- Advertisement -