రాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట: సబితా

69
sabitha
- Advertisement -

రాష్ట్రంలో అన్ని కులవృత్తుల వారికి పెద్దపీట వేస్తుందని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉచిత చేప పిల్లల పంపిణిలో భాగంగా రంగారెడ్డి జిల్లా జలపల్లి పెద్ద చెరువులో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సబితా…రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. సరఫరదారుడు తీసుకొచ్చిన చేప పిల్లలను నిశితంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటినే చెరువుల్లో విడుదల చేయాలని స్పష్టం చేశారు.

రంగారెడ్డి: గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులతో అవి జలకళ సంతరించుకున్నాయని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -